పలమనేరు: పట్టణం నందు ఆదివారం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి కేంద్రం ఆధ్వర్యంలో మాంసాహారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. జీవరాశులను చంపే అధికారం ఎవరికి లేదు, భూమిపైన మనతోపాటు సమానంగా బతికే హక్కు జీవులకు కలిగి ఉందన్నారు. ప్రజలందరూ ధ్యానం అలవాటు చేసుకోవాలి శాఖాహారులుగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.