గంగాధర నెల్లూరు: రేపు పాలసముద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటన
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాలసముద్రంలో సోమవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. హౌసింగ్ కాలనీలో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీని ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఎంపీడీవో కార్యాలయంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.