కనిగిరి మండలంలోని చిన్న ఇర్లపాడు లో తహసిల్దార్ జయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను తహసిల్దార్ జయలక్ష్మి పంపిణీ చేశారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ తో మంజూరు చేసిన పాస్ పుస్తకాల ద్వారా రైతులు తమ భూములు ఎక్కడున్నాయో సులభంగా తెలుసుకోవడంతోపాటు హద్దులను కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. మండల టిడిపి అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో పంపిణీ చేస్తున్న పట్టాదార్ పాసు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.