ఏపిపిఎస్సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంచార్జి డిఆర్ఓ రామ్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని ఇంచార్జి డిఆర్ఓ ఛాంబర్ లో ఏపిపిఎస్సి పరీక్షలకు సంబంధించి సమన్వయ సమావేశాన్ని ఇంచార్జి డిఆర్ఓ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జి డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజులపాటు జిల్లాలో ఏపిపిఎస్సి పరీక్షలను (ఫోర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిటన్ టెస్ట్,ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించడం జరుగుతుందన్నారు.ఉదయం సెషన్ 9:30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ 02:30 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు.