పామూరు: కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఉన్న లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తక్షణ రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. పామూరు పట్టణంలో శుక్రవారం జరిగిన సీఐటీయూ కార్యకర్తల సమావేశానికి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చింది అన్నారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉన్నాయన్నారు. లేబర్ కోడ్స్ ను రద్దుచేసి, కార్మికుల పాత చట్టాలను పునరుద్ధరించాలని రమేష్ డిమాండ్ చేశారు.