వనపర్తి: ఖిల్లా ఘనపూర్:పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయమని బిజెపి సీనియర్ నాయకులు, ఫిలిం బోర్డ్ సభ్యుడు కుమారస్వామి అన్నారు.గురువారం ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మోడీ విజయ సంకల్ప సభ సన్నాహాక సమావేశాన్ని బిజెపి మండల అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన నాగర్ కర్నూల్ లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ కు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని సమావేశంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు