కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారి పల్లకీని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేదపండితులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.