కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ కాలనీలో రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతిపాదిత రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణం పనులు నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు.