కనిగిరి పట్టణంలో పోలీసులతో కలిసి సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని సిఐ శ్రీనివాసులు ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద నుండి హనుమంతునిపాడు, పెద్ద చెర్లోపల్లి పోలీసులతో కలిసి సిఐ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకు సైకిల్ తొక్కలన్నారు. సైకిల్ తొక్కడం ద్వారా ఫిట్ ఉండవచ్చున్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సీఐ పిలుపునిచ్చారు.