చీమకుర్తిలో మాజీ ఎమ్మెల్సీ దివంగత గానాల రామ్మూర్తి 134వ జయంతి కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రామ్మూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సానాల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. గానాల రామ్మూర్తి నాడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో MLCగా పనిచేస్తూ విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎనలేని సేవలు చేశారని, బీసీల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.