ఎల్లంపేట్ మున్సిపల్ ఘనపూర్లోని శ్రీక్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతర మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మల్లారెడ్డి తెలిపారు. ఈ జాతర ప్రజల ఐక్యతకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఆలయ అర్చకులు మల్లారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదం కల్పించారు.