వెలిగండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ మహాలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి హాజరైన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, రెవిన్యూ, హౌసింగ్ వంటి సమస్యలపై చర్చించారు. రానున్న దృష్ట్యా గ్రామాల్లో ఎక్కడ మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలను పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.