అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల కోసం ముఖ్య రహదారులు, చెక్పోస్టులు, టోల్గేట్లు, పట్టణాల ప్రవేశ ద్వారాలు, గ్రామీణ పరిసరాల్లో పోలీసులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద కదలికలు గమనించిన వ్యక్తులను పోలీసులు విచారించి పంపారు. నేర నిరోధక చర్యల్లో భాగంగా పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి, గస్తీ విధులను కూడా బలోపేతం చేశారు.