సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మరియు మండల నోడల్ అధికారి సురేష్ బాబు అక్షరాంధ్ర కేంద్రాలకు స్టడీ మెటీరియల్స్ ను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... నిరక్షరాస్యులైన వయోజనుల్లో అక్షరాస్య శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అక్షరాంద్ర కేంద్రాలను నిర్వహిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు ,వాలంటీర్ల సహకారంతో వయోజనుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు వారిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.