అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి లో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా సరస్వతి అనే మహిళను ఢీకొన్న ప్రైవేట్ బస్సు. సరస్వతికి తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.