కళ్యాణదుర్గం-రాయదుర్గం నియోజకవర్గం అత్యంత ముఖ్యమైన భైరవాణి తిప్ప, జీడిపల్లి ప్రాజెక్టులు ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవ వల్ల వేగంగా సాగుతున్నాయని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కాలువ మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతంగా చేయిస్తున్నారన్నారు. త్వరలోనే పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.