సత్య సాయి జిల్లా రామగిరి మండలం కుంటిమిది గ్రామం వద్ద శుక్రవారం 5:30 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుంటిమద్ది చెరువును పరిశీలించి గంగపూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నిన్నటి రోజున పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేదే పనిగా పెట్టుకున్నారు అన్నారు, గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్ని నిధులు వెచ్చించాడో వైసీపీ నాయకులకు తెలుసుకొని మాట్లాడితే మంచిదని పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మాజీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు సమాధానం చెప్పాలని పరిటాల సునీత విమర్శించారు.