విశాఖపట్నం: జిల్లాలో ఏపి లెజిస్లేచర్ కమిటీ పర్యటన
ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలపై అధికారులతో కమిటీ సమీక్ష
ఛైర్మన్
విశాఖరాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, వాటి కార్యకలాపాలు, పనితీరు, అకౌంట్ల ఆడిటింగ్ పై పరిశీలనకు ఉభయ సభల సభ్యులతో ఏర్పాటైన లెజిస్లేచర్ కమిటీ జిల్లా పర్యటనను శుక్రవారం ప్రారంభించింది. ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఈ కమిటీ శుక్రవారం ఉదయం జిల్లాకు చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యింది. ఛైర్మన్ కూన రవికుమార్తో పాటు కమిటీలో సభ్యులుగా వున్న శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ ఐజాక్ బాషా, తదితరులు పాల్గొన్నారు.