విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని,ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రుల మధ్య సుస్థిర సమన్వయం కోసం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ –3.0 ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను కలెక్టర్ తిలకించి, అభినందించారు.