సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దేవాలయాలకు బోనాల చెక్కులు అందజేత కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని 268 దేవాలయాలకు బోనాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బోనాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బోనాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.