భవిష్యత్తుకు సంబంధించి యువత ముందే తగిన లక్ష్యసాధనతో కృషి చేస్తే తప్పక అనుకున్నది సాధిస్తారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అదనపు డిజిపి కిల్లాడ సత్యనారాయణ అన్నారు. శనివారం నర్సీపట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు నిరోధం యువత పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా విచ్చేశారు.