ఏపిపిఎస్సి పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఏపిపిఎస్సి ఛైర్మన్ శశిధర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏపిపిఎస్సి పరీక్షల కోసం అనంతపురం కలెక్టరేట్ లోని ట్రెజరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని ఏపిపిఎస్సి ఛైర్మన్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఏపిపిఎస్సి ఛైర్మన్ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజులపాటు జిల్లాలో ఏపిపిఎస్సి పరీక్షలను (ఫోర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిటన్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించడం జరుగుతోందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందన్నారు.