సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంక వద్ద ఉన్న రహదారిపై శుక్రవారం కల్వర్టు కృంగిపోవడంతో హరహదారి గుండా ప్రయాణించే వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయి. చెన్నై నుండి వస్తున్న భారీ వాహనం అధికలోడుతో వస్తూ కల్వర్టు మీదకు వచ్చేసరికి కల్వర్టు ఒక్కసారిగా కృంగిపోయింది. దీంతో వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనాలు ఇరువైపులా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.