రాయదుర్గం పట్టణంలోని పార్వతి నగర్ వాణి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ సమీపంలో ఇంటిముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాదితుడు కె. రఘు ప్రసాద్ స్థానిక పోలీసు స్టేషన్ లో ఈ మేరకు పిర్యాదు చేశారు. బాదితుడు మాట్లాడుతూ తాను గార్మెంట్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నానని, రాత్రి ఇంటిముందు యూనికార్న్ బైక్ (AP02AS 2523) పార్కింగ్ చేశానని ఉదయం లేచి చూసేసరికి బండి మాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు.