బెంగళూరు నుండి రాయదుర్గం వస్తున్న SRS ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం టుంముకూరు సమీపంలో హైవేపై టైరు పగిలి డివైడర్ ను బస్సు డీకొనిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. స్థానిక పోలీసు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గతంలోనూ ఈ బస్సు ప్రమాదానికి గురైంది. కండీషన్ లేని బస్సులతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు