పలమనేరు: వి.కోటలో ఘనంగా శ్రీకనకదాసు జయంతి,
వేలాదిమందితో సాగిన కలశాల ర్యాలీ, పాల్గొన్న బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఎమ్మెల్యే అమర్
వీ.కోట: మండల కేంద్రంలో కురుబ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదాస జయంతి మహోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలువైపులా నుంచే గాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున కురబ కులస్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎగువ కూడలి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వేలాదిమందితో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలు పాల కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరియు కర్ణాటక మాజీ మంత్రి వర్తుర్ ప్రకాష్ తదితరులు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.