వీ.కోట: మండలం కృష్ణాపురం గ్రామ రైతు రఘు తెలిపిన సమాచారం మేరకు. లక్షలు అప్పు చేసి తన పొలంలో అరటి చెట్లను నాటాను నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూలి వాళ్ళు వచ్చి పనులు చేసి వెళ్లారు మళ్లీ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆవులు కట్టేసి వెళ్ళినప్పుడు కూడా అరటి చెట్లు బాగున్నాయి. శుక్రవారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వచ్చి చూసేసరికి అరటి చెట్లన్నీ నరికేసిఉన్నాయి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు. రైతు రఘుకు ప్రత్యర్థులు ఎవరైనా ఈ పనులు చేశారా లేదా ఇంకేదైనా కోణం ఉందా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సిఉంది.