ఈనెల 09వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడిల కాన్ఫరెన్స్ కారణంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం సాయంత్రం 6:00 సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు.పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, ఎవరు అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రాకూడదని తెలిపారు.