పలమనేరు: ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎస్.ఐ లోకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్తపేట, బండ్లవీధికి చెందిన మోహన్ కుమారుడు విష్ణు వ్యవసాయ పనిముట్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. విష్ణు భార్య లతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోగా, ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాను కు వేలాడుతూ కనిపించాడని ఒంటిపై 5 కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నాము పోస్టుమార్టం అనంతరం ఇది హత్య లేదా ఆత్మహత్య అనేది పూర్తి వివరాలు తెలుపుతామన్నారు.