మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జనవరి 12వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ రాజాబాబు ఆదివారం ఒక ప్రకటనలు తెలిపారు. మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు.