బాల్య వివాహ రహితంగా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లో ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ విముక్త భారత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించరు.