ఆత్మకూరు పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ ఆర్. రామాంజి నాయక్, CI మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తు సాధించాలని సూచించారు. చదువు ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాంటి చెడు అలవాట్లకు బానిసలయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.