అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలోని ఆవులెన్న గ్రామంలో మంగళవారం తహసీల్దార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన పట్టా దారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా రీ సర్వే పూర్తి కావడంతో 487 మంది రైతులకు గ్రామ సర్పంచ్ రామ్మోహన్ చౌదరి, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ గురుబ్రహ్మలతో కలిసి తహసిల్దార్ పట్టాదారు పాసుపుస్తకాలన్ని పంపిణీ చేశారు.