జగిత్యాల: కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం,ఆదివారం మొదటిరోజు ప్రశాంతం,పరీక్షా కేంద్రాలను తనిఖీచేసిన కలెక్టర్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లాలోని కోరుట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాటు జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్ , జేఎన్టీయూ కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బి,సత్య ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు.కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆదివారం ఉదయం సెషన్ లో...