బైరెడ్డిపల్లి: మండలం తీర్థం గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా నేడు విద్యార్థులు ఒక చక్కటి నాటికను ప్రదర్శించారు అందులో బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఒక కొడుకు గ్రామంలో ఉన్న తల్లి పట్ల పడే ఆవేదనను విచ్చేసిన వారి కంటనీరు పెట్టించిన విధంగా నటించిన విద్యార్థులను ఎంత పొగిడినా తక్కువే అంటూ తెలిపారు.