అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని బాబు జగ్జీవనరామ్ కాలనీలో విఘ్నేష్ అనే బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ నకు యత్నించింది అనేది వాస్తవం కాదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు శనివారం పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని బాబు జగ్జీవనరామ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతుల కుమారుడు విగ్నేష్ ను శుక్రవారం ఎత్తుకెళ్తోందని స్థానికులు గమనించారు. మహిళ తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ కు చెందిన రమణమ్మగా గుర్తించారు.