సంతనూతలపాడు గురుకుల పాఠశాలను ఎంపీడీవో సురేష్ బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టడీ తరగతులను ఎంపీడీవో పరిశీలించారు. రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు అన్ని విధాల సన్నద్ధం కావాలని ఎంపీడీవో సూచించారు. విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా క్లాసులను నిర్వహించాలని ఎంపీడీవో ఆదేశించారు.