కామారెడ్డి: మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న షీ టీం సభ్యులు సౌజన్య,ప్రవీణలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్ అభినందించారూ.
కామారెడ్డి జిల్లాలోని విద్యార్థినులు మరియు మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న షీ టీం సభ్యులు సౌజన్య మరియు ప్రవీణలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ గారు స్వయంగా అభినందించారు. పాఠశాలలు, కాలేజీల్లో "గుడ్ టచ్ - బ్యాడ్ టచ్" లాంటి కీలక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందించినందుకు ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డు ప్రదానం చేశారు. షీ టీం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కొత్త చట్టాలపై సమాచారం ఇవ్వడమే కాక, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తున్నారు. వారి వివరా