అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారిని పూర్తిగా తొలగించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృథ్వి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడారు.