అనంతపురం అర్బన్: నగరంలోని భాగ్యనగర్ లో ప్రమాదవశాత్తు కింద పడి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | Jul 5, 2025
అనంతపురం నగరంలోని భాగ్యనగర్ లో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడిన అబ్దుల్ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈనెల మూడవ తేదీన తన ఇంటి వద్ద మెటికలు ఎక్కుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.