గుంతకల్లు: మండలంలోని దోనిముక్కల గ్రామంలో పొలంలో అక్రమంగా మట్టి తరలింపు, జేసీబీ, టిప్పర్ లారీలను అడ్డుకున్న రైతులు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని దోనిముక్కల గ్రామంలో ఇద్దరు రైతుల పొలాల్లో నుంచి కొందరు అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలంలోని దోనిముక్కల గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు గ్రామ శివారులో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి. అయితే బుధవారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జేసీబీ వాహనం తెచ్చి టిప్పర్ల ద్వారా ఎర్ర మట్టిని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బాధిత రైతులు సంఘటన స్థలానికి చేరుకొని మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. తమ భూములలో మాకు చెప్పకుండా ఎలా మట్టి తీసుకెళ్లారని అడ్డుకున్నారు.