పలమనేరు: నాగాలమ్మ ఆలయంలో నేడు మార్గశిర్ష ఆరుద్ర శివ నక్షత్రం సూర్యోదయానికి ముందు శివాభిషేకం శివ దర్శనం శివ పూజ అత్యంత పుణ్యప్రదం. మార్గశిర్ష ఆరుద్ర నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి మాఘమాసం కృష్ణ చతుర్థి శివరాత్రి రోజుకి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడన్నారు. అందుకే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి శివునికి అత్యంత ప్రీతికరం, అందువల్లనే సూర్యోదయానికి మునుపు శివ పూజలు అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు, తదుపరి విచ్చేసిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.