తూకాల్లో మోసం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇనిస్పెక్టర్ శంకర్ వ్యాపారులను హెచ్చరించారు. రాయదుర్గం పట్టణంలో కిరాణా వ్యాపారులతో ఆదివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి లీగల్ మెట్రాలజీ పై అవగాహన కల్పించారు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు సరుకులు అమ్మినా, తక్కువ తూకాలు వేసినా, కాలం చెల్లిన సరుకులు అమ్మినా భారీ జరిమానాలు తప్పవని వివరించారు. వ్యాపారులంతా వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి చట్టప్రకారం వ్యాపారాలు చేసుకోవాలని కోరారు. పలువురు వ్యాపారులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇనిస్పెక్టర్ కు వివరించారు.