అనంతపురం నగరంలోని తపోవనంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆటోను ఢీకొన్న కారు. ఆటోలో ప్రయాణిస్తున్న వడియం పేట గ్రామానికి చెందిన వెంకటేష్, సరస్వతి, రాజేశ్వరి, లక్ష్మి, పెద్దక్క, వాణి వీరికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతపురం టౌన్ నుండి వడియం పేటకు ఆటోలో వెళుతుండగా తపోవనంలో ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్, సరస్వతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని వైద్యులు రామాంజనేయులు తెలిపారు.