అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో నెలకొన్న పలు సమస్యలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి మంగళవారం టీడీపీ మండల టిడిపి నాయకులు తీసుకెళ్లారు. విజయవాడలోని మంత్రి కార్యాలయానికి వెళ్లిన టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున పార్టీ సీనియర్ నాయకులు రాధాకృష్ణ పెద్ద తిప్పయ్యలు మంత్రికి మండలంలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారని టిడిపి నాయకులు పేర్కొన్నారు.