అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ఉన్న పిస్తా హౌస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో సురేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.