గుడిపాల ఎంపీపీకి షాక్ గుడిపాల ఎంపీపీ ప్రసాద్ రెడ్డిపై 8మంది ఎంపీటీసీలు మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ సాయినాథ్, ఎంపీడీవో శిరీష సమక్షంలో ఇవాళ అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా 8మంది ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో వైసీపీ తరఫున గుడిపాల ఎంపీపీ అయిన ప్రసాద్ రెడ్డి పదవిని కోల్పోయారు.