సూళ్లురుపేట: సూళ్లూరుపేటలో లాడ్జిలపై పోలీసుల దాడులు
- ఓ నిర్వాహకురాలని ఇద్దరు మహిళలను ఒక విటుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని పలు లాడ్జిలపై ఆదివారం పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు లాడ్జిలను పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై బ్రహ్మనాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరాన్ని గుర్తించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరా