కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తమతో ఎగ్జామ్ ఫీజు,క్లినికల్ ఫీజులు కట్టించుకొని హాల్ టికెట్ ఇప్పటివరకు ఇవ్వలేదని విద్యార్థులు కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అండగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. జూలైలో జరగాల్సిన ఎగ్జామ్ కు ఫీజు కట్టించుకుని తిర ఎగ్జామ్ సమయానికి హాల్ టికెట్ కోసం అడిగితే ఫీజు కట్టలేదని సప్లిమెంట్ ఎగ్జామ్ రాయచ్చని చెప్పి ఇప్పటివరకు స్పందించలేదని ఏడాది చదువువృథా అవుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.