మార్కాపురం జిల్లా కంభంలోని మదర్ థెరిస్సా కాలనీవాసులు 20 ఏళ్లుగా తాము వాడుకుంటున్న రహదారిని రైల్వే అధికారులు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా నివసిస్తున్న ప్రజలు, తమకు రోడ్డు సదుపాయం కల్పించాలని ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గాల పోరాట ఫలితంగా ఏర్పడిన ఈ కాలనీకి రోడ్డు వేయాలని గతంలో ఎన్నోమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని నాయకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మౌలిక సదుపాయాలతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.